Bigg Boss 7 Telugu:పవరాస్త్ర విజేతగా శివాజీ

28
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు రెండో వారం పూర్తికావొచ్చింది. ఇవాళ హౌస్‌ నుండి ఒకరు ఎలిమినేట్ కానుండగా 13వ రోజు శనివారం కావడంతో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. కంటెస్టెంట్స్ చేసిన తప్పులను వివరిస్తూ స్వీట్ వార్నింగ్ ఇస్తూనే పవరాస్త్ర విజేతగా శివాజీ నిలిచాడని తెలిపారు.

పవరాస్త్ర పోటీలో భాగంగా షకీలా,శివాజీ,అమర్‌ దీప్ పోటీ పడగా ఈ ముగ్గురిలో ఎవరూ గట్టిగా అరిచారని అనుకుంటున్నావ్ అంటూ దామినిని అడిగారు నాగార్జున. అయితే దామిని సరిగా ఆన్సర్ చెయ్యలేదు. దీంతో శివాజీ మైక్‌కి బాగా దగ్గరగా ఉండకూడదు.. అలా అని దూరంగా వెళ్లి అరవకూడదు అప్పుడే గెలుస్తారని చెప్పగా యస్ ఇది కరెక్ట్ ఆ పని నువ్వే సరిగా చేశావ్ శివాజీ విన్నర్ అని ప్రకటించారు. డెసిమల్స్ స్కేల్‌సో షకీలాకి 9 మార్కులు రాగా, శివాజీకి 11 వచ్చింది. అమర్‌దీప్‌కు 6 మార్కులు వచ్చాయి.

తర్వాత బిగ్ బాస్ పై శివాజీ కామెంట్స్ చేయడాన్ని తప్పుబట్టారు నాగార్జున. నాగ్ చెప్పిన మాటలతో ఏకీభవించిన శివాజీ… బిగ్‌బాస్‌ను అనే రైట్‌ తనకి లేదంటూ సారీ చెప్పారు. ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆట తీరును ప్రశంసించారు. ఇంకా బాగా ఆడాలని, కాన్సట్రేషన్ గేమ్‌పై ఉంటాలని సలహా ఇచ్చారు. అయితే ఓ విషయంలో క్లాస్ పీకారు నాగ్. హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు ప్రశాంత్‌కు ఇచ్చిన మొక్కను తెప్పించారు. ఈ మొక్కనే నువ్వు కాపాడుకోలేకపోయావ్.. ఇక నువ్వేం రైతు బిడ్డవంటూ గట్టిగానే సెటైర్ వేశారు.

Also Read:KCR:దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

తర్వాత ఒక మీటర్ పెట్టి.. రెడ్, ఎల్లో, గ్రీన్ రంగుల వైపు మీటర్ తిప్పుతూ వాళ్ళ గురించి చెప్పాడు. రెడ్ అంటే డేంజర్ జోన్ లో ఉన్నట్టు, ఎల్లో అంటే పర్లేదు, ఇంకా బాగా ఆడాలని, గ్రీన్ అంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని చెప్పారు. సస్పెన్స్ కొనసాగిస్తూ చాలా మందికి రెడ్ చూపించారు నాగ్. ఇక ఈవారం నామినేషన్స్ నుంచి శివాజీ, అమర్ దీప్ సేఫ్ అయ్యారని చెబుతూనే ప్రశాంత్, షకీలా, గౌతమ్, ప్రిన్స్, తేజ, శోభాయాశెట్టి, రతిక ఇంకా డేంజర్ లోనే ఉన్నారని తెలిపాడు. ఇక ఇవాళ ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘ఓటు’ ట్రైలర్

- Advertisement -