Bigg Boss 7 Telugu:వీడెవడ్రా బిగ్ బాస్.. శివాజీ ఫైర్

28
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 33 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ పై రెచ్చిపోయాడు శివాజీ. కాఫీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ… కాఫీ తాగడం నా అలవాటు.. నేను మళ్లీ అడగను.. ఇచ్చాడా? ఇస్తాడు.. లేదంటే వెళ్లిపోతా? కాఫీ ఇవ్వకుండా కామెడీ చేయమంటే ఎట్టా చేస్తాం అంటూ తనదైన శైలీలో చెప్పుకొచ్చాడు. బొక్కలో నుంచి వస్తుందా కామెడీ.. వీడెవడ్రా బిగ్ బాస్?? కాఫీ ఇవ్వనంటాడు అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా శోభాశెట్టి – ప్రియాంక ఎలిమినేట్ ఆవడంతో మిగిలిన నాలుగు జంటలు ప్రిన్స్ యావర్-తేజా, శుభశ్రీ-గౌతమ్, శివాజీ-ప్రశాంత్, అమర్ దీప్-సందీప్‌లకు తమ తమ ఇళ్ల దగ్గర నుంచి లెటర్స్ వచ్చాయని.. అయితే వాటిలో జంటకొచ్చి ఒకటే లెటర్ చదవే అవకాశం ఉంటుందని మిగిలిన వ్యక్తి త్యాగం చేయాలని.. ఎవరైతే త్యాగం చేస్తారో.. వాళ్లు తమ లెటర్‌తో పాటు.. కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని చెప్పారు.

ఈ టాస్క్ గురించి చెప్పగానే.. శివాజీ నేను ఈ టాస్క్ ఆడటం లేదు బిగ్ బాస్ అని మైక్ తీసి కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత బయటకు వెళ్లిన శివాజీ.. ప్రశాంత్‌ని పిలిచి.. నువ్వు ఆడ్రా ప్రశాంత్.. ఇద్దరిలో కెప్టెన్‌గా ఎవరో ఒకరే ఆడాలి.. కాబట్టి నువ్వే ఆడు. ఆ లెటర్ తీసుకో.. లెటరూ లేకపోవడం ఏంటి? కెప్టెన్సీ లేకపోవడం ఏంటీ.. సర్లే ఏదైనా పర్లేదు అంటూ ప్రశాంత్‌కి కెప్టెన్సీ పోటీదారుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఇక గౌతమ్-శుభశ్రీలో శుభ శ్రీ త్యాగం చేసి తమ్‌ని కెప్టెన్సీ పోటీదారుడిగా ఛాన్స్ ఇచ్చింది. గౌతమ్ తన తండ్రి రాసిన లేఖను చదివి కన్నీళ్లుపెట్టుకున్నాడు.

ఇక యావర్-తేజాలలో యావర్.. తేజా కోసం త్యాగం చేయగా చివరికి గౌతమ్, తేజా, ప్రశాంత్, సందీప్‌లు కెప్టెన్సీ పోటీదారులుగా తలపడబోతున్నారు.

- Advertisement -