Bigg Boss 7 Telugu:ఇంటి సభ్యులకు క్లాస్ పీకిన నాగ్

40
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజయవంతంగా మూడో వారం పూర్తిచేసుకోవడానికి వచ్చింది. ఇవాళ ఇంటి నుండి ఎవరు బయటకు రానున్నారో తెలియనుండగా శనివారం ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులకు మరోసారి క్లాస్ పీకారు నాగార్జున. ముఖ్యంగా అమర్‌ దీప్‌ చౌదరి, శోభాశెట్టిలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అంతేగాదు సంచాలక్‌ సందీప్‌ను కూడా ఓ ఆటాడేసుకున్నారు. నాగ్‌ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన కంటెస్టెంట్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

వీకెస్ట్‌ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్‌ చేయమంటే… ప్రిన్స్‌ యావర్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని చెప్పి సైడ్‌ చేశావ్‌…దీనిని బట్టి నువ్వు వీక్ అని అంగీకరించినట్టేనా అని శోభాను కడిగిపారేశారు నాగ్. హౌస్‌లో సంచాలక్‌గా సందీప్ పూర్తిగా ఫెయిలయ్యాడని ….గేమ్‌ మధ్యలో నువ్వు అస్సలు ఇన్వాల్వ్‌ కాకూడదు. మరి నువ్వు ఎందుకు కంటెస్టెంట్స్‌కు పాయింట్స్‌ ఇస్తున్నావ్‌ అని సందీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read:మంత్ ఆఫ్ మధు.. లవ్లీ మెలోడీ సాంగ్

ఇక రైతు బిడ్డ ప్రశాంత్ను వదల్లేదు నాగ్. నువ్వు కూడా గేమ్‌ ఆడొచ్చుగా తనదైన శైలిలో పంచులు వేశారు. హౌస్‌లో సేఫ్ గేమర్‌ ఎవరు? గేమ్ ఛేంజర్ ఎవరు? అని కంటెస్టెంట్లందరినీ అడిగారు నాగార్జున. పల్లవి ప్రశాంత్‌ ఎవరినో చూపించి గేమ్‌ ఛేంజర్‌ బ్యాడ్జి పెట్టగా.. నువ్వు కూడా తనను చూసి నేర్చుకోవచ్చుగా ప్రశాంత్‌ అంటూ కౌంటర్‌ వేశారు.

శివాజీ రెండో పవర్ అస్త్ర దక్కించుకుని నాలుగు వారల ఇమ్యూనిటీని సొంత చేసుకోగా మూడో పవర్ అస్త్రను సొంతం చేసుకుంది ఎవరు అన్నది చెప్పేశారు నాగ్‌. ప్రియాంక చేతుల మీదుగా నాగార్జున శోభాకు మూడో అవర్ అస్త్ర ను ఇప్పించారు. దీంతో శోభా శెట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read:ఆ హీరో పెళ్లి చేసుకుంటాడట

- Advertisement -