బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 10 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్గా సాగింది. ఈ వారం నామినేషన్స్లో శివాజీ,పల్లవి ప్రశాంత్, రతిక, టేస్టీ తేజా, అమర్ దీప్ చౌదరి, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, యావర్ 9 మంది ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుండి బయటకు రానున్నారు.
ఇక సోమవారం ఎపిసోడ్లో పిచ్చిపట్టినట్టు చేసిన పల్లవి ప్రశాంత్…మంగళవారం కూడా అది కంటిన్యూ చేశాడు. నాకు ధైర్యం వచ్చినప్పుడు తొడ కొడతా.. అంటూ మళ్లీ మళ్లీ కొట్టి రచ్చచేశాడు.తర్వాత
బజర్ నొక్కుదువు గానీ ఒక్క నిమిషం ఆగు అక్కా అని ప్రశాంత్ మర్యాదగా అడిగితే.. మోనిత తన విలనిజం చూపిస్తూ ఆగకుండా బజర్ని గట్టిగా నొక్కింది. దీంతో ప్రశాంత్ తన మేనరిజం చూపించాడు.
పులికి వేటాడటం.. ఈ పల్లె ప్రశాంత్కి ఆటాడటం బాగా వచ్చు. మీరు ఎన్ని నామినేషన్స్ అయినా వేసుకోండి.. బయట మా వాళ్లు ఉన్నారు.. నాకు ఆ ధైర్యం చాలు అని అందరికి కౌంటర్ ఇచ్చాడు.దీంతో అమర్ దీప్, శోభాశెట్టిలు చప్పట్లు కొడుతూ.. ఇదీ నీ రియాలిటీ.. ఇప్పుడు బయటపడింది అని కౌంటరిచ్చారు.
Also Read:ఆహాలో ‘మాయా పేటిక’
తర్వాత రతిక కూడా పల్లవి ప్రశాంత్నే నామినేట్ చేసింది. . రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ లేకపోతే ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరు? నువ్వు రైతు బిడ్డ అనే సెంటిమెంట్ దారి ఎంచుకున్నావ్? అని తెలపగా సెంటిమెంట్ దారా? అని అడిగాడు ప్రశాంత్. అవును సెంటిమెంట్ దారే.. నువ్వు అన్ని సీజన్లు చూసి ప్రిపేర్ అయ్యి వచ్చావు అని చెబుతూ నామినేషన్ చేసింది. తర్వాత శుభ శ్రీ కూడా ప్రశాంత్నే నామినేట్ చేసింది. హౌస్లో ఉన్న 12 మందిలో 9 మంది ప్రశాంత్ని నామినేట్ చేశారంటే ఏ రేంజ్లో టార్గెట్ చేశారో అందరికి అర్ధమయ్యే ఉంటుంది.
నామినేషన్స్ ముగిసాక దామిని – రతిక మధ్య ఆసక్తికర సంభాషణ జరుగగా నామినేషన్స్ టైంలో ప్రశాంత్పై నోటికొచ్చినట్లు తిట్టిన అమర్ దీప్.. ప్రశాంత్ దగ్గరకు వచ్చి.. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా చెప్పారా? అని అన్నాడు. దీంతో ప్రశాంత్ మాట్లాడావ్ అన్నా.. బీటెక్ వాళ్ల గురించి నేను ఏమన్నా అన్నానా? అని అడగడంతో.. అలాంటి వాళ్లు కూడా ఉన్నారని మాత్రమే చెప్పాను అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న శివాజీ మాత్రం ప్రశాంత్కి ధైర్యం చెప్పాడు.
ఇక అమర్దీప్ తనలోని విషాన్ని మొత్తం కక్కేశాడు. పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ పై పడి ఏడ్చాడు. నాకంటే ప్రశాంత్కి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారంటూ తెగ బాధపడిపోయాడు. అయితే ప్రశాంత్ ఒక్క సీజన్ చూశాడా? పది సీజన్లు చూశాడా? వాడి ఇష్టం. అది మీకెందుకు? ఇక్కడికి వచ్చిన వాళ్లు బిగ్ బాస్ చూడకుండా వచ్చేశారా? వాడి స్ట్రాటజీతో వాడు ఆడుతున్నాడు.. మీకెందుకు? అంటూ అమర్ దీప్కి గట్టిగానే గడ్డిపెట్టాడు శివాజీ.
Also Read:సెట్విన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ సంతోష్..