మూడో పవరాస్త్ర విజేత ఎవరో తెలుసా?

49
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా మూడోవారం పూర్తికావడానికి వస్తోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో 7 గురు ఉండగా ఓటింగ్‌లో లీస్ట్ ఉన్న దామిని ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు ప్రిన్స్ యావర్. ఇక హౌస్ లో ఉన్నవారిలో మూడో పవర్ అస్త్ర సాధించడానికి బిగ్ బాస్ ముగ్గురిని ఎపిక చేశారు.

శోభా శెట్టి, ప్రియాంక, యావర్ ను ఎపిక చేశారు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రకు అనర్హులో చెప్పాలని వారి ముందు ఉంచిన బామ్మను పగలకొట్టాలి చెప్పారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటే ఆ ఇద్దరమ్మాయిలో ఈ అబ్బాయి పేరు చెప్పి అతడిని తప్పిస్తారని తెలిసి కూడా ఈ టాస్క్ఇచ్చాడు . దీంతో శోభా, ప్రియాంక ప్రిన్స్ పేరు చెప్పారు. దీంతో అన్ ఫెయిర్ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు యావర్ బాబు.

మూడో పవర్ అస్త్ర పొందడానికి ప్రియాంక, శోభా శెట్టి గట్టిగా పోటీపడ్డారు. ఇద్దరు అమ్మాయిలు కాబట్టి సింపుల్ గా బుల్ రైడ్ టాస్క్ ఇచ్చాడు. ఈ ఎద్దు బొమ్మపై ఎవరు ఎక్కువ సేపు ఉంటే వారే విన్నర్ అని చెప్పగా ఇద్దరు భామలు గట్టిగా పోటీపడ్డారు. ఈ టాస్క్‌లో ప్రియాంక బుల్ ను పట్టుకొని ఎక్కువ సేపు ఆట ఆడింది. బుల్ తిరుగుతున్నా కూడా పట్టు వదలకుండా దాన్ని గట్టిగా పట్టుకొని చాలా సేపు ఆ ఎద్దు పై ఉంది. దీంతో ప్రియాంక విజేతగా నిలవడం ఖాయమే కాగా ఇవాళ అఫిషియల్‌గా ప్రకటించనున్నారు బిగ్ బాస్.

Also Read:తంతిరం..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -