BB6..ఫినాలే మళ్లీ అర్జునే టార్గెట్

241
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా ముగింపుకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్‌లో ఇవాళ విజేత ఎవరో తెలియనుండగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టాప్‌ 5లో రేవంత్, శ్రీహాన్, కీర్తి,ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. ఇక ఒక్కొక్కరిని స్టేజ్‌ మీదకు తీసుకువచ్చి మాట్లాడిస్తుండగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లోనూ అర్జున్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు శ్రీసత్య.

మిడ్ వీక్‌లో శ్రీసత్య ఎలిమినేట్ కావడం నాకు చాలా బాధగా ఉంది అని నాగార్జున తెలపగా ఫినాలేకి ఒక్కరోజు ముందు ఎలిమినేట్ కావడం బాధగానే ఉంది సార్.. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని రెస్పెక్ట్ చేస్తున్నా అని తెలిపింది. హౌస్‌లో ఐదుగురిలో విన్నర్ ఎవరు? అని నాగార్జున అడగడంతో.. రేవంత్ కానీ.. శ్రీహాన్ కానీ అని చెప్పింది. ఎందుకు వాళ్లిద్దరూ నీ ఫ్రెండ్స్ అని వాళ్ల పేర్లు చెప్తున్నావా? అని నాగార్జున అడగడంతో.. అదేం కాదు సార్.. వాళ్లపై నమ్మకం ఉంది అని తెలిపింది.

తర్వాత అక్కడ అర్జున్ కళ్యాణ్ ఉన్నాడు చూశావా? వెళ్లిపక్కన కూర్చో అని అంటూ శ్రీసత్యతో అన్నారు నాగార్జున. లేదు సార్.. నేను ఫైమా గీతు రాజ్‌ల పక్కన కూర్చుంటా? అని అర్జున్ కళ్యాణ్‌ని మరోసారి తీసిపక్కనపెట్టేసింది. ఏంటి అర్జున్ పక్కన కూర్చోవా? కోపం వచ్చిందా? అని నాగార్జున పుల్ల పెట్టడంతో.. కోపం ఏం లేదు సార్.. అర్జున్ కంటే.. రాజ్, గీతులతో నాకు బాండింగ్ ఉంది అని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -