శ్రీహాన్ దుప్పట్లో దూరిన శ్రీసత్య

1871
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 94 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి దెయ్యం ప్రవేశించింది. దీంతో ఇంటి సభ్యులు గజగజ వణికిపోయారు. శ్రీసత్య అయితే ఏకంగా శ్రీహాన్ దూప్పట్లో దూరింది.

తర్వాత కోతలు పెట్టిన ప్రైజ్‌మనీని మళ్లీ పెంచుకోవడానికి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఛాలెంజ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ రెండో ఛాలెంజ్‌ ఇవ్వగా.. ఇందులో రేవంత్‌, ఇనయ పోటీపడాల్సి వచ్చింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్‌ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయని బిగ్ బాస్ చెప్పారు.

రేవంత్, ఇనయలకు పిరమిడ్ ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇద్దరూ చెరో బేస్ మీద పేపర్ గ్లాసులతో పిరమిడ్ పేర్చి దాన్ని పడిపోకుండా మరో టేబుల్ మీదికి తీసుకెళ్లాలి. ఈ టాస్క్‌లో రేవంత్ గెలిచాడు. ఇంటి సభ్యులు కూడా రేవంతే గెలుస్తాడని అంచనా వేశారు. దీంతో ప్రైజ్ మనీకి రూ.1,10,000 వచ్చి చేరింది.

తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన మూడో ఛాలెంజ్ కోసం ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంపిక చేసుకున్నారు. ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్‌- శ్రీసత్య జంటలు మనీ ట్రాన్స్‌ఫర్ గేమ్‌లో పోటీపడ్డాయి. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి-కీర్తి జంట గెలుస్తుందని ఇనయ, రేవంత్‌, రోహిత్‌ ఒక అభిప్రాయానికి వచ్చారు. దీన్నే బిగ్ బాస్‌కు చెప్పారు. కానీ, ఈ ఛాలెంజ్‌లో శ్రీహాన్-శ్రీసత్య జంట విజయం సాధించింది. ఇక తర్వాత ఛాలెంజ్‌లో రేవంత్ విజేతగా నిలిచారు.

ఇక అర్ధరాత్రి దాటిన తరవాత ఇంట్లోకి దెయ్యం వచ్చింది. వెంటనే శ్రీసత్య జింక పిల్లలా చెంగున ఒక గెంతు గెంతి శ్రీహాన్ దుప్పట్లోకి దూరిపోయింది. అది దెయ్యం కాదు మనషులు అంటూ ఇనయ ధైర్యం చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -