పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్..

17
- Advertisement -

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చింది హైకోర్టు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్‌ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది.

సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్ట్‌ డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఈనెల 24న వాదనలు వింటామని తెలిపింది డివిజన్‌ బెంచ్‌. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించింది హైకోర్టు.

సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్.

Also Read:వార్తల్లో నిలిచేందుకు అసత్య ఆరోపణలా:చిరు

- Advertisement -