కోమటిరెడ్డికి షాక్..టీఆర్ఎస్‌లోకి చండూరు జడ్పీటీసీ

117
chanduru
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ప్రజాదరణ కరువు కావడంతో ప్రలోభాలకు తెరలేపారు ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రె్డ్డి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంను బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారు. బీజేపీలో చేరిన 24 గంటల్లోపే తిరిగి కారెక్కారు వెంకటేశం.

మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి తనను బలవంతంగా బిజెపిలోకి తీసుకువెళ్లారని, అక్కడికి వెళ్లిన తర్వాత ఎంతో మనోవేదనకి గురయ్యానని ఈ సందర్భంగా కర్నాటి వెంకటేశం తెలిపారు. కేటీఆర్ తో సమావేశం సందర్భంగా చండూరు కు సంబంధించిన ప్రజా సమస్యలను వివరించి వీటి పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

కర్నాటి బాటలోనే మరికొంత మంది నేతలు సైతం బీజేపీని వీడేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -