వైసీపీకి బిగ్ షాక్..

3
- Advertisement -

వైసీపికి బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మేయర్ గంగాడ సుజాత సహా, డిప్యూటీ మేయర్, 10మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గత ఎన్నికల్లో 50 కార్పొరేటర్ల స్థానాలకుగాను 43 స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. ప్రస్తుతం టీడీపీలో 17 మంది చేరికతో.. టీడీపీలో కార్పొరేటర్ల సంఖ్య 24కి చేరింది. అఫిషియో ఓటు హక్కు ఉన్న ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలతో పాటు ఒంగోలు ఎంపీకి ఉండటంతో కార్పొరేటర్ల సంఖ్య 27కి చేరింది. ఈ పరిస్థితుల్లో ఒంగోలు కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు టీడీపీకి స్పష్టమైన మెజారిటీ దక్కినట్లు అయ్యింది.

Also Read:ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

- Advertisement -