Bigg Boss 7 Telugu:రతిక కాళ్ల మీద పడిన ప్రశాంత్

25
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగ నాలుగోవారం నామినేషన్స ప్రక్రియ ముగిసింది. ఈవారం ఎలిమినేషన్‌లో 6 గురు ఉండగా 24 వ రోజు తాజా ఎపిసోడ్‌లో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. రతిక కాళ్లపై పడి క్షమాపణలు కోరారు ప్రశాంత్. క్షమించక్కా.. ఇక బరాబర్ నీ తమ్ముడ్ని అంటూ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్.

తొలుత ఉదయాన్నే అమర్ బాబు-సందీప్ సిల్లీ మేటర్‌తో ఎపిసోడ్ మొదలైంది. నేను ఫస్ట్ వీక్ గేమ్ ఆడాను.. లాస్ట్ వీక్ గివ్ అప్ ఇచ్చాను.. కాబట్టే ఈవిడ (ప్రియాంక) చుట్టూ తిరిగాను. అయితే నన్ను డిజర్వ్ కాదని చెప్పినప్పుడు నేను గట్టిగా అడగలేదు.. అదే నేను చేసిన తప్పు అని అమర్ చెప్పుకొచ్చాడు. తర్వాత రతిక ఒంటరిగా ఉన్న టైమ్ చూసి ప్రశాంత్ కాళ్ల బేరానికి వచ్చాడు. ఇక నీ విషయంలో వేలు పెడితే చీపురు కట్ట పెట్టి కట్టు,,,ఇకపై అక్క లెక్కే అనుకుంటాను అని కాళ్ల మీద పడటంతో క్షమించేసింది రతిక.

తర్వాత నాలుగో పవరాస్త్ర గేమ్‌ని మొదలుపెట్టాడు బిగ్ బాస్. 10 వేల విలువైన బీబీ కాయిన్స్.. ముగ్గురు పవరాస్త్ర విజేతలయిన శివాజీ, సందీప్, శోభా శెట్టిలను బ్యాంకర్లుగా నియమిస్తూ వాళ్ళకి ఇస్తాం.. అవి వాళ్లు కంటెస్టెంట్లకు పంచి పెట్టాలని చెప్పాడు. ఒక్కొక్క కాయిన్ విలువ 100.. ఎవరికి ఎంత ఇవ్వాలో బ్యాంకర్ల నిర్ణయం.. అయితే ఇవి లాకర్లోనే ఉండాలి.. ఆట పూర్తయ్యే సరికి ఏ కంటెస్టెంట్ దగ్గర ఎక్కువ బీబీ కాయిన్స్ ఉంటాయో.. వాళ్లే నాలుగో పవరాస్త్ర దక్కించుకొని రెండు వారాల ఇమ్యూనిటీ దక్కించుకుంటారని తెలిపారు.

Also Read:వారందరీ కంటే జూ.ఎన్టీఆరే బెటర్

అంతే గేమ్ స్టార్ట్..బ్యాంకర్ల నుండి పవరాస్త్ర రాబట్టేందుకు కంటెస్టెంట్లు ముప్పు తిప్పలు పడ్డారు. అయితే శోభా మాత్రం తన ఫేవర్‌గా ఉండే సీరియల్ బ్యాచ్ ప్రియాంక-అమర్‌లకు బాగానే ఇచ్చేసింది. అయితే తేజ మాత్రం శోభా దగ్గర వాళ్ల కంటే ఎక్కువగా 51 బీబీ కాయిన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత యావర్ 43తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వీటిని సేఫ్‌గా లాకర్లో పెట్టించి వాటికి ముగ్గురు బ్యాంకర్లు (శివాజీ, శోభా, సందీప్) రక్షణగా ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక తర్వాత ఫొటోలు చూసి ఎవరు ఎక్కువ దిగారో చెప్పాల్సిన బాధ్యతను శోభాకు ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో శోభా ప్రతి ఫొటోను బాగా చూసి లెక్కపెట్టింది. అయితే యెల్లో బాక్స్‌లో పూర్తిగా లేకుండా తీసుకున్న ఫొటోలను లెక్కపెట్టకూడదంటూ శోభా అనడంతో అమర్ ఫైర్ అయ్యాడు. అలా రూల్స్‌లో లేదు.. ఎల్లో బాక్స్‌లో ఉండి ఫొటో దిగాలి.. నేను సగం ఉన్నానా ఫుల్ ఉన్నానా అన్నది ప్రాబ్లమ్ కాదు.. అది నా ఇష్టం అరి తెలిపాడు అమర్. ఈ టాస్క్‌లో గౌతమ్-అమర్ ఎక్కువ ఫొటోలు దిగారని శోభా చెప్పడంతో రతిక-తేజల దగ్గరున్న మొత్తం కాయిన్స్ అమర్-గౌతమ్ పంచుకున్నారు. తర్వాత గౌతమ్‌కి ఎక్కువ కాయిన్స్ ఇచ్చాడు అమర్.

Also Read:పిక్ టాక్ : కుర్ర భామ అందాల గిలిగింతలు

- Advertisement -