కుప్పం నుండి పోటీచేసేది నేనే:భువనేశ్వరి

16
- Advertisement -

కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ నిజం గెలవాలి కార్యక్రమాల్లో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించారు నారా భువనేశ్వరి.చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కారం చేశారు.

ఇద్దరూ కావాలంటూ చేతులెత్తరాఉ సభికులు. అలా కుదరదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగారు. సరదాగా అంటున్నా.. నేను చాలా హ్యాపీగా ఉన్నా.. రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు.. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని తెలిపారు.

శాంతిపురం మండలంలో ఆడబిడ్డలకు ఆర్ధిక స్వేచ్చ అంశంపై మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేయగా వైరల్‌గా మారాయి. భువనేశ్‌వరి సరదా సంభాషణ కట్ చేసి వైసీపీ ట్విట్టర్ మరియు సాక్షి చానల్ లో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇంచార్జి పి ఎస్ మునిరత్నం ఖండించారు.

Also Read:Pawan:పవన్ కు ‘పొత్తు ఎఫెక్ట్’ తప్పదా?

- Advertisement -