మొక్కలునాటిన భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌

400
green challenge
- Advertisement -

రాజ్య సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలునాటారు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు ఇచ్చిన ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. భూపాలపల్లి ఎస్.బి.ఐ. బ్యాంక్ మేనేజర్ దీపక్, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్ , వరంగల్ ఆర్టీసీ డిపో 2 మేనేజర్ బానుకిరణ్‌లను మొక్కలు నాటాలని కోరారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తనకు భూపాలపల్లి డీఎస్పీ గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారని అందులో భాగంగా తాను మొక్కలు నాటానని చెప్పారు.

గ్రీన్ చాలెంజ్ అనేది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు.

green challenge

- Advertisement -