సీఎంఆర్‌ఎఫ్‌కు భారత్ బయోటెక్ 2 కోట్ల విరాళం..

328
Bharath biotech
- Advertisement -

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది.

దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కృష్ణ ఎమ్. ఎల్లా, కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర కె. ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి. ప్రసాద్ మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించారు.

కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ చైర్మన్ కృష్ణ ఎమ్. ఎల్లా తెలిపారు.

- Advertisement -