- Advertisement -
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఉద్దేశపూర్వకంగా తప్పులు చూపడం సరైంది కాదు అన్నారు.
రంగనాయకుల మండపంలో జరగాల్సిన పరివట్టం వెంకయ్య చౌదరి ఇంటి వద్ద ఎందుకు నిర్వహించారు..? చెప్పాలని ప్రశ్నించారు. మీ హయాంలో స్వామి వారి శేష వస్త్రం ఎవరెవరికి చేరిందో, ఎలా బయటకు వెళ్లిందో త్వరలోనే లెక్కలు బయటపడతాయి అని చురకలు అంటించారు.
గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టను దిగ జార్చే విధంగా కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
Also Read:BB9: నామినేషన్స్ నుంచి ఇమ్మూ సేఫ్
- Advertisement -

