ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరగనున్న మూడో వన్డే తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతారనే వార్తలను బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఈ సీనియర్ బ్యాటర్ దేశం తరఫున ఆడటం కొనసాగిస్తారని, ప్రస్తుతం ఆయన భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
జూలై 19న లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డే తర్వాత సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవచ్చనే అంశంపై ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నిరాకరించారు. రాబోయే మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు చివరి మ్యాచ్ అవుతుందనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నంత కాలం ఈ ముంబై బ్యాటర్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీడియాలో చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆదివారం లార్డ్స్ వేదికగా రోహిత్ తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే చర్చ అసలు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. రోహిత్ భారత వన్డే జట్టులో క్రమబద్ధమైన సభ్యుడు. ఆయన ప్రణాళికల్లో ఉన్నంత కాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, లార్డ్స్ వన్డే ఆయనకు చివరి మ్యాచ్ కాదు” అని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో రోహిత్ ఫామ్పై విమర్శలు వస్తున్నప్పటికీ, భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఈ సీనియర్ ఓపెనర్కు మద్దతుగా నిలిచారు. సిరీస్ చివరి మ్యాచ్లోకి అడుగుపెడుతున్న రోహిత్పై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కోటక్ మాట్లాడుతూ.. “చూడండి, రోహిత్ శర్మ లాంటి పెద్ద ఆటగాడిపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. అలాంటి ఒత్తిడికి గురికావడానికి ఆయన చాలా గొప్ప ఆటగాడు. అవును, మొదటి రెండు మ్యాచ్లలో ఆయన పరుగులు చేయలేదు, కానీ అది పెద్ద తేడా ఏమీ చూపించదని నేను భావిస్తున్నాను. ఈ రోజు చూస్తే ఆయన ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేలా కనిపించారు, కానీ పర్వాలేదు (అవుట్ అయినా)” అని అన్నారు.
Also Read:‘మహేంద్రగిరి వారాహి’..విజయం సాధించాలి!
రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి బీసీసీఐకి, జాతీయ సెలెక్టర్లకు లేదా భారత జట్టు యాజమాన్యానికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రస్తుతం ఆయన ఫామ్ సరిగ్గా లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆయన రిటైర్మెంట్ అంశం హాట్ టాపిక్గా మారింది. అయితే, దీనిపై సంబంధిత వర్గాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

