బీసీ బిల్లుకై మరో ‘స్వాతంత్య్ర సమరం’

10
- Advertisement -

“చట్టసభలలో” బీసీ బిల్లు సాధనకై మరో స్వతంత్ర సమరంలా జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఈనెల 26న తలపెట్టిన సదస్సును భారీ స్థాయిలో నిర్వహింప తలపెట్టడానికి అక్టోబర్ మొదటివారం కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నాడు ఆయన’ బీసీ భవన్’లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధన ఈ వర్గాల చిరకాల డిమాండ్ అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.ఉభయ సభలలో” బీసీ బిల్లు”ప్రవేశపెట్టి ఆమోదించేంతవరకు మా పోరాటం, అనేక దశలుగా,పలు రూపాలలో కొనసాగుతుందన్నారు. అన్ని పక్షాల, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఏకమై ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

డాక్టర్ వకుళాభరణం మాట్లాడుతూ..’మహిళా బిల్లుల్లో ‘ఓబీసీ సబ్ కోటాను’ చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 75 కోట్ల ఓబిసి డిమాండ్ను తప్పక నెరవేర్చినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నారు బీసీల డిమాండ్లను కేంద్రం సానుకూలంగాపరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. తక్కువ సమయంలో తేదీని నిర్ణయించడం, గణేష్ నవరాత్రుల కారణంగా అనేకమంది ప్రముఖుల సూచనల మేరకు ఈ నెల ’26’న నిర్వహించాల్సిన “బీసీ బిల్లు” సాధన సదస్సును వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

Also Read:పిక్ టాక్ : కసిగా చూస్తూ ఊరిస్తున్న శ్రీముఖి

అక్టోబర్ మొదటి వారంలోగా నిర్ణయించి ,భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంఘాలు, సామాజిక వేత్తలు, వివిధ ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ అంశంపై పూర్తిస్థాయిలో పనిచేసే నిపుణులను కూడా’బీసీ సదస్సు’కు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ నులి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ బి ఆర్ఎస్ నాగేంద్ర గౌడ్ బిఆర్ఎస్ సంగం నాయకులు రాజ్ కుమార్ దితరులు పాల్గొన్నారు.

- Advertisement -