వీడని సస్పెన్స్.. ఢిల్లీకి సీనియర్ నేతలు!

37
- Advertisement -

తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎల్పీ సమావేశంలో సీఎం ఎవరనే దానిపై ఓ క్లారిటీకి రాలేకపోయారు. దీంతో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు.

సాయంత్రంలోపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో అందరిలో టెన్షన్ నెలకొనగా ఇక సీఎం రేసులో ఉన్న సీనియర్ లీడర్స్ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గేతో వీరు భేటీ కానున్నారు.

వాస్తవానికి తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని.. సోమవారం రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా వాయిదా పడింది.

Also Read:ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే..జాగ్రత్త!

- Advertisement -