బంగ్లాదేశ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 గంటలకు ముగుస్తుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి సమయానికి ప్రారంభ ధోరణులు వెల్లడి అయ్యే అవకాశం ఉండగా, ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం ఉదయం వరకు తుది ఫలితాలు స్పష్టమయ్యే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు ఇస్లామిక్ జమాత్-ఇ-ఇస్లామీ నేతృత్వంలోని రెండు కూటముల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. సర్వేల ప్రకారం BNPకు ఆధిక్యం లభించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.
2024లో దీర్ఘకాల ప్రధాని షేఖ్ హసినా జనరేషన్ Z ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం వల్ల పదవీచ్యుతులైన తర్వాత దేశం మళ్లీ ప్రజాస్వామ్య పంథాలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఇక హసినా నేతృత్వంలోని అవామీ లీగ్పై నిషేధం విధించబడింది. ఆమె ప్రస్తుతం దీర్ఘకాల మిత్రదేశమైన భారతదేశంలో స్వయంగా ప్రవాసంలో ఉన్నారు. దీంతో ఢాకా–న్యూఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో చైనా ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

