టీ20..3వికెట్లు కొల్పోయిన ఇండియా

276
Rohith Out
- Advertisement -

బంగ్లాదేశ్ తో ఇండియా మూడు టీ20మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. మొదటి టీ20మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. కాగా 36పరుగుల్లోనే 2 వికెట్లు కోల్పోయింది భారత్. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

ఓపెనర్ శిఖర్ ధావన్ కు తోడు శ్రేయాస్ అయ్యర్ కాసేపు పోరాడాడు. ప్రస్తుతం గ్రీసులో రిషబ్ పంత్, శేఖర్ దావన్ ఉన్నారు. 13ఓవర్లకు 3వికెట్ల నష్టానికి 83పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ 5బంతుల్లో 9పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లోకేష్ రాహుల్ కూడా 17బంతుల్లో 15పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి తీసుకోవడంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.

- Advertisement -