పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు,నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పవన్పై ఈగ వాలిన తనదైన శైలీలో మండిపడే గణేష్..పలు ఇంటర్వ్యూల్లో ఆయనే తనకు దేవుడని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంతా బండ్ల గణేష్ జనసేనలో చేరుతారని భావించారు. అయితే,ఎవరు ఉహించని విధంగా ఆయన హస్తం గూటికి చేరి పవన్కు పంచ్ ఇచ్చారు.
ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆయన పార్టీ కోసం కార్యకర్తల పనిచేస్తానని తెలిపారు. పవన్ తనకు దేవుడని…కాంగ్రెస్ అంటే ఇష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయమంటే బరిలోకి దిగేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఇటీవలె తన పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీని కలిసిన బండ్ల ..ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పటినుంచే ఆయన కాంగ్రెస్లో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ బండ్ల ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బండ్ల గణేష్ గురువు మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కాంగ్రెస్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.