‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో బండ్ల గణేశ్

354
Bandla Ganesh Sarileru Nikevaru
- Advertisement -

మహర్షి సినిమా తర్వాత మహేశ్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈసినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొద్ది రోజుల క్రితం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈసినిమాలో బండ్ల గణేశ్ నటించిననున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాల్టీ నుంచి బండ్ల గణేశ్ ఈమూవీ షూటింగ్ లో పాల్గోన్నారు.

కెరీర్ ఆరంభంలో కమెడీయన్ గా చేసిన బండ్ల గణేశ్ ఆ తర్వాత నిర్మాతగా భారీ సినిమాలను నిర్మించారు. కొద్ది రోజుల క్రితం సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేవ్ సరిలేరు నీకెవ్వరు తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. లేడి సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈసినిమాలో ప్రత్యేక పాత్రలో నటించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -