బండి సంజయ్‌కు నిరసన సెగ..

40
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ దిష్టిబోమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు మన్నే కవిత రెడ్డి, సంగీత యాదవ్ తదితరులు అందోళనలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డపై అనుచితంగా మాట్లాడిన బండి సంజయ్‌ వెంటనే బేషరతుగా ఎమ్మెల్సీకి కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్‌పై బీజేపీ రాజకీయ కక్షను సాధిస్తుందన్నారు. కవితకు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి…

సర్వేలన్నీ అనుకూలం..విజయం తథ్యం…

బైబై మోదీ..ఫ్లెక్సీ@హైదరాబాద్‌

రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -