ఘనంగా పుల్లూరు బండ జాతర: హరీష్ రావు

526
harish rao
- Advertisement -

పుల్లూరు బండ జాతరను ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మినృసింహస్వామి జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో జాతర పోస్టర్‌ని ఆవిష్కరించిన హరీష్…బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు.

జాతరకు వచ్చే పర్యాటకులకు అసౌకర్యాలు లేకుండా చూడాలని….త్రాగునీరు, రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కలకుంట్ల రంగాచారి, సర్పంచ్‌ నరేష్‌ గౌడ్‌, వంశపారంపర్య అర్చకులు రామకృష్ణమాచార్యులు, ఉప సర్పంచ్‌ ప్రసాద్‌, కో ఆప్షన్‌ సభ్యులు నర్సింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌, వెంకట్‌, ప్రదీప్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -