గ్రీన్‌ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన బాలరాజు యాదవ్..

59
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం మొక్కను నాటారు. ఈరోజు ఆయన హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పెండింగ్ లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీకి విచ్చేశారు.

ఈ సందర్భంగా బాలరాజు హన్మకొండ జిల్లా పశు వైద్య కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ స్ఫూర్తితో హరితహారంలో మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిడి డాక్టర్ వెంకటనారాయణ, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -