పునీత్ పార్థివదేహానికి బాలయ్య నివాళి..కంటతడి

116
nbk
- Advertisement -

శాండిల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కమార్(46) చివరిచూపు కోసం పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తరలివెళ్లారు. కర్ణాటకలోని కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం పార్ధివదేహాన్ని ఉంచగా నందమూరి బాలకృష్ణ కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూడగానే బాలయ్య కన్నీరుపెట్టుకున్నారు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్‌ను ఓదారుస్తూ కంటతడి పెట్టారు.

ఈ సమయంలో బాలయ్యతో నిర్మాత సాయి కొర్రపాటి, హీరో అర్జున్ ప్రభుదేవాతో సహా పలువురు సినిమా సెలబ్రిటీలు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ అంటే పునీత్‌ రాజ్‌కుమార్‌కి ఎంతో అభిమానం. గతంలో కర్ణాటకలో జరిగిన ఓ వేడుకకు బాలకృష్ణ హాజరవగా.. ఆ సమయంలో వారిద్దరి మధ్య అనుబంధంకి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది.

- Advertisement -