బాలయ్య మాంచి మసాలా సాంగ్‌ !

229
Balakrishana paisa vasool
- Advertisement -

నందమూరి బాలకృష్ణ 101వ మూవీ పైసా వసూల్ విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆ చిత్ర నిర్మాతలు మూవీ ప్రమోషన్స్‌పై దృష్టిసారించారు. పూరి జగన్నాథ్-బాలకృష్ణ లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘పైసా వసూల్’పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికితోడు ఇటీవల విడుదలైన పైసా వసూల్ స్టంపర్‌‌కి భారీ స్పందన కనిపించింది. తాజాగా బాలయ్య మంచి మాస్ మసాలా సాంగ్ ప్రోమోతో ప్రేక్షకులముందుకొచ్చాడు. బాలయ్య చేస్తున్న కొత్తచిత్రం ‘పైసా వసూల్’ లోనిది ఈ పాట. మంగళవారం టైటిల్ సాంగ్ ప్రోమోను బయటకు వదిలింది చిత్ర యూనిట్. ‘నే అడుగెడితే.. షో మొదలెడితే..అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..’ అంటూ సాగిపోతున్న ఈపాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య హుషారు చూస్తుంటే థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయం అనిపిస్తోంది.

మరోవైపు అప్పుడెప్పుడో ‘మేము సైతం’ కార్యక్రమం కోసం గొంతు సవరించి అందరిని ఆశ్చర్యపరిచిన బాలయ్య.. తాజాగా మరోసారి స్టేజ్ షోకు సిద్దమవుతున్నారు. ఈ నెల 17న ఖమ్మం వేదికగా జరగబోయే తన కొత్త సినిమా ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో బాలయ్య మరోసారి సింగర్ అవతారం ఎత్తనున్నారు. తొలిసారిగా ఈ సినిమా కోసం ‘ఏక్ పెగ్ లావో..’ అంటూ పాట పాడిన బాలయ్య.. ఇప్పుడదే పాటను ఆడియో వేడుకలో స్వయంగా పాడనున్నారు. దీంతో బాలయ్య పర్ఫామెన్స్‌కు ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రీయ, కైరాదత్ ఆడిపాడనున్నారు. భవ్య క్రేయషన్స్ పతాకంపై సెప్టెంబర్ 1న భారీ అంచనాల నడుమ ఈసినిమా విడుదలకానుంది.

- Advertisement -