జ‌య‌ల‌లిత‌ మృతి తీర‌ని లోటు..

254
Balakrishna-Mohan babu condolences to Jaya
- Advertisement -

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ మృతి తీరని లోటని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సినిమా రంగం, రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత‌ త‌న‌దైన‌ ముద్ర వేశారని…. నాన్న‌గారితో కూడా ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిందని గుర్తుచేశారు. అనేక స‌వాళ్ల‌తో కూడిన రాజ‌కీయాల్లో కూడా ముఖ్య‌మంత్రిగా ఆరు సార్లు ఎన్నిక కావ‌డం చాలా గొప్ప విష‌యమన్న బాలకృష్ణ… ఎంతో మంది మ‌హిళ‌ల‌కు, పోరాట శ‌క్తికి ఆమె నిద‌ర్శ‌నమని కొనియాడారు. జయలాంటి లీడర్స్ అరుదుగా ఉంటారని… ఇలాంటి గొప్ప నాయ‌కురాలు మ‌న‌ల్ని విడిచిపెట్టి అనంత లోకాల‌కు వెళ్ల‌డం ఎంతో బాధాక‌రమన్నారు. జ‌య‌ల‌లిత‌ మ‌ర‌ణం సినీ రంగానికే కాదు, రాజ‌కీయ రంగానికి కూడా తీర‌ని లోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకమని మంచు మోహన్ బాబు అన్నారు. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌ అన్నారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను. క‌లిసిన ప్ర‌తిసారి గొప్ప అదృష్టంగా భావించానని తెలిపారు. గొప్ప న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు. జ‌య‌ల‌లిత‌ మ‌ర‌ణం త‌మిళ సోద‌రీ సోద‌రీమ‌ణుల‌కు తీర‌నిలోటని చెప్పారు. ఆమె మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్ల‌డం చాలా బాధాక‌రమని… ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

- Advertisement -