టాలీవుడ్లో అతితక్కువ కాలంలో పాపులర్ అయిన విశ్వక్ సేన్…తాజాగా మరో స్టార్ దృష్టిలో పడ్డాడు. స్వీయ దర్శకత్వంలో ఫలక్నామా దాస్ సినిమా తీసిన విశ్వక్ దానికి స్వికేల్గా దాస్కా ధమ్కీ తీస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటివలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమ ట్రైలర్ విడుదల కోసం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా వస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఇటివలే జరిగిన ఆన్స్టాపబుల్-2లో బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యంగ్ హీరో సినిమాకు మద్దతుగా నిలిచేందుకు బాలయ్య ముందుకోచ్చాడు. హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొననున్నారని టాలీవుడ్ టాక్.
ధమ్కీ చిత్రం ఫిబ్రవరి 2023న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని విశ్వక్సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఇవి కూడా చదవండి…