మొక్కలు నాటిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ..

263
gopichand
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉధృతంగా ముందుకు కొనసాగుతుంది ఈ చాలెంజ్ లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటడం జరుగుతుంది.

ఇందులో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.

ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని తెలంగాణలో హరితహారం; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల పచ్చదనం బాగా పెరిగిపోయిందని ప్రజలలో కూడా చాలా అవగాహన పెరిగింది; మొక్కలు పెంచుకోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా సిక్కి రెడ్డి; మేఘన; అరుణ్ విష్ణు లను గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇదే విధంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన ఇద్దరి కుమారులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడ ఒక మొక్కను నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -