ప్రయాణం పూర్తైంది..

222
Baahubali film series is over
Baahubali film series is over
- Advertisement -

దర్శకుడు రాజమౌళి దాదాపు 5 ఏళ్ల తన దర్శకత్వ జీవితాన్ని బాహుబలికి అంకితం చేశారు. ఇంత సమయం తీసుకుంటుందని ఆయనకు కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అందుకు ఆయనకు గొప్ప ఫలితమే దక్కినప్పటికీ ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన అహర్నిశలూ కష్టపడ్డారు. ప్రాంచైజీలో చివరి భాగమైన ‘బాహుబలి-ది కంక్లూజన్’ రిలీజైనప్పటికే ఆయన విశ్రాంతి తీసుకోకుండా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ దేశాల్లో పర్యటించారు. చిత్రబృందంతో కలిసి లండన్‌లో చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇక ఈ ప్రచారంతో బాహుబలి సినిమా సిరీస్‌ పూర్తైపోయినట్టేనని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిత్రబృందంతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

‘బాహుబలి-2’ ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ చిత్రం రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లు దాదాపు హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. దీంతో 5 రోజులకే రూ. 100 కోట్ల షేర్ ను దక్కించుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా అదే జోరును కొనసాగించింది.

- Advertisement -