టీసీఏ సెక్రెటరీపై అజారుద్దీన్‌ పరువు నష్ట దావా..

175
Mohammad Azharuddin
- Advertisement -

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) సెక్రెటరీ ధరమ్ గురువా రెడ్డిపై హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోసియేషన్‌ (HCA) ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ పరువు నష్ట దావా వేశారు. ఓ ప్రెస్ మీట్ సందర్భంగా గురువా రెడ్డి మాట్లాడుతూ.. అజార్‌పై ఇంకా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ముగియలేదని ఆరోపించిన గురువా రెడ్డి..ఆయనపై కేసులు రిఓపెన్ చేసి విచారణ చేయాలని అమిత్ షాను కోరుతామన్నారు. సిబిఐ కేసులున్న వ్యక్తి హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉండే అర్హత లేదన్నారు. ఈ నేపథ్యంలో గురువా రెడ్డి వాఖ్యలపై అజార్ నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా వేశారు. అజార్ రెండు కోట్ల పరువు నష్టం వేశారు. ఈ మేరకు గురువా రెడ్డి అజార్ పరువునష్ట దావాపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -