ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న..

14
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. నిన్న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్‌ని ఎన్నుకున్నారు. స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ …అయ్యన్న పాత్రుడిని సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు అయ్యన్న. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా పనిచేశారు.మొత్తంగా పదిసార్లు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయగా ఏడుసార్లు గెలుపొందారు. ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.

Also Read:KTR:గనుల వేలంలో పాల్గొనడం సిగ్గుచేటు

- Advertisement -