ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. విధులకు హాజరు కాకుండా యాప్లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశారు పంచాయతీ కార్యదర్శి.
పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం . ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుండే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉండగా, కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు అధికారులు.
ఈ తనిఖీల్లో జగిత్యాల జిల్లాలో విధులకు హాజరు కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్న ఒక పంచాయతీ కార్యదర్శి నిర్వాకం చూసి షాకయ్యారు అధికారులు. కొందరు విధులకు వెళ్లకుండా ఇతరుల సహాయంతో తాము లేకుండానే అటెండెన్స్ నమోదు చేసుకోగా, ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నారు మరి కొందరు పంచాయతీ కార్యదర్శులు.
Also Read:TTD:భక్తులకు టీటీడీ హెచ్చరిక

