శ్రీరెడ్డిపై సినీ నిర్మాత దాడి..

426
sri reddy
- Advertisement -

సినీనటి శ్రీరెడ్డిపై దాడి జరిగింది. సినీ నిర్మాత సుబ్రమణి,అతని అసిస్టెంట్ గోపి తనపై దాడి చేశారని,చంపుతారని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదుచేశారు. చెన్నైలోని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి గురువారం అర్థరాత్రి సుబ్రమణి,గోపి తనపై దాడిచేశారని పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించిన శ్రీరెడ్డి తనపై దాడికి పొలాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారమే కారణమని తెలిపింది.

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి కొంతకాలంగా చెన్నైలో ఉంటోంది. తమిళ చిత్రాల్లో నటిస్తుండటంతో పాటు, తన బయోపిక్ రెడ్డీస్ డైరీ కూడా అక్కడే తెరకెక్కుతుండటంతో చెన్నైలోనే ఎక్కువగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చినా తిరిగి చెన్నైకి వెళ్లింది.

పొలాచ్చి సెక్స్ రాకెట్ తమిళనాడులో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకొనే 20 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచ్చు బిగించి, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి వ్యాపారం చేసుకొంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టుచేశారు. దీనిపై శ్రీరెడ్డి కూడా స్పందించింది. ఈ వ్యవహరంపై స్పందించడం వల్లే తనపై దాడి జరిగిందని శ్రీరెడ్డి తన తాజా పోస్టులో పేర్కొంది.

- Advertisement -