రాష్ట్రపతి నిలయంలో ప్రారంభమైన ఎట్ హోం

442
athome
- Advertisement -

శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 20న రామ్ నాద్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి విచ్చేశారు. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

tamilsaikcr

కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -