దిల్ రాజుకి అశ్వినిదత్ ఓపెన్ ఛాలెంజ్

39
ashwini dutt
- Advertisement -

పాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు నాగ అశ్విన్ చెబుతున్న ప్రాజెక్ట్ కె విడుదల తేదీని 2024 జనవరి 12 ప్రకటించాక ఇండస్ట్రీలో ఒక్కసారిగా వేడి చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇది అంత త్వరగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఎలాగూ ఆది పురుష్, సలార్ లు ఈ ఏడాది జూన్ – సెప్టెంబర్ లో వస్తాయి కాబట్టి కనీసం సంవత్సరం తర్వాత ప్రభాస్ కొత్త మూవీ ఉంటుందనుకున్నారు

కట్ చేస్తే ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడింది. కానీ అదే సమయంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న రామ్ చరణ్ 15ని సంక్రాంతికే ప్లాన్ చేసుకున్నారనే వార్త గత రెండు వారాలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ అధికారికంగా చెప్పలేదు. ఈలోగా నిర్మాత అశ్వినిదత్ వ్యూహాత్మకంగా పావులు కదిపి అందరికంటే ముందుగా డేట్ ని లాక్ చేసుకోవడంతో మిగిలినవాళ్ళు ఇరకాటంలో పడ్డారు

మొన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు భయపడకుండా తన వారసుడుని మూడు రోజులు ఆలస్యంగా అయినా సరే బరిలో దింపి తన పట్టు సాధించుకున్న దిల్ రాజు మరి ప్రాజెక్ట్ కె విసిరిన సవాల్ ని కాచుకుంటారా లేక వాయిదా వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇవి చాలదన్నట్టు ఒకవేళ దసరా దీపావళి మిస్ అయితే పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు కూడా పొంగలే టార్గెట్ గా ప్లాన్ చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -