బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూత

426
arun_jaitley
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే మృతి చెందారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. గ‌త రెండు వారాలుగా ఎయిమ్స్ డాక్ట‌ర్లు ఆయ‌న‌కు చికిత్స అందించారు. ఆగ‌స్టు 9వ తేదీన జైట్లీ ఎయిమ్స్‌ హాస్ప‌ట‌ల్లో చేరారు. అరుణ్ జైట్లీ మృతితో బీజేపీ నేతలు శోక సంద్రంలో మునిగిపోయారు.

జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.

అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు.

పలు రాష్ట్రాల బీజేపీ ఇంఛార్జీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో అమృత్‌ సర్‌ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో   ఓటమిపాలయ్యారు. అనారోగ్యం కారణాల వల్ల అరుణ్ జైట్లీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్ర మంత్రివర్గంలో కూడా తనకు చోటు కల్పించవద్దని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.

- Advertisement -