అర్నాబ్‌ గోస్వామిపై దాడి…ఖండించిన కేంద్రమంత్రి

310
arnab
- Advertisement -

ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై ఇవాళ ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. స్టూడియో నుండి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో అర్నాబ్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు.

అర్నబ్ పై దాడి ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా అర్నాబ్‌కు మద్దతుగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచారా శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ..అర్నబ్‌పై దాడిని ఖండించారు. ఏ జర్నలిస్టుపై దాడి జరిగినా దానిని ఖండిస్తామన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దం…ఇలాంటి చర్యలను సహించమన్నారు.

ఇక ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు.

- Advertisement -