అర్జున అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్‌ సన్మానం

19
- Advertisement -

అర్జున అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి సన్మానం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని అర్జున అవార్డు గ్రహీతలు కలవగా ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలను అడిగి తెలుసుకున్నారు.

విజేతలందరిని సీఎం రేవంత్ శాలువాలతో సత్కరించారు. ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తగినంత ప్రోత్సహం అందిస్తామన్నారు. అర్హతలకు అనుగుణంగా ఆర్థిక సాయం, ఉద్యోగావకాశాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు.

హుసాముద్దీన్ (బాక్సింగ్ , కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత), ఈషా సింగ్ (షూటింగ్ , ఆసియా క్రీడలు 2023 బంగారు పతక విజేత), ఆసియా క్రీడలు 2023లో పాల్గొన్న నిఖత్ జరీన్ (బాక్సింగ్‌లో కాంస్య పతకం), కినాన్ చెనై డారియస్ (షూటింగ్‌లో బంగారు పతక విజేత), అగసర నందిని (అథ్లెటిక్స్‌లో కాంస్య పతక విజేత), ఎన్. సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్ పార్టిసిపెంట్) పి. గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్ పార్టిసిపెంట్). పారా అథ్లెట్, పారా గేమ్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన జీవన్‌జీ దీప్తి…సీఎం రేవంత్‌ని కలిసిన వారిలో ఉన్నారు.

Also Read:జాలీ రైడ్‌కు వెళ్లినట్టుగా అయలాన్

- Advertisement -