- Advertisement -
తిరుమల శ్రీవారి సేవలో పాల్గోంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ మూవీ టీమ్. హీరో నందమూరి కళ్యాణ్ రామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 18న విడుదల కాబోతున్న సినిమా సక్సెస్ కావాలని శ్రీవారికి ప్రార్థనలు చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది.
విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించగా తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి – కొడుకుల పోరులా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read:పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ లేఖ
- Advertisement -

