మెస్సి మెరిసే…నేయ్‌మార్‌ ఏడిసే

505
- Advertisement -

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 సెమీస్‌లోకి అర్జెంటీనా ఎంట్రీ ఇచ్చింది. శుక్ర‌వారం లుసైల్ స్టేడియంలో జ‌రిగిన రెండ‌వ క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో.. నెద‌ర్లాండ్స్‌పై షూటౌట్ ద్వారా అర్జెంటీనా విజ‌యం సాధించింది. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-3 గోల్స్ తేడాతో నెద‌ర్లాండ్స్‌పై విక్ట‌రీ కొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లోకి ప్ర‌వేశించింది. ఈ టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అర్జెంటీనా 9 గోల్స్ చేసింది. దాంట్లో మెస్సి నాలుగు గోల్స్ మెస్సి చేశాడు.

మరోక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 4-2 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ పై క్రొయేషియా విజ‌యం సాధించింది. టోర్నీ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన బ్రెజిల్ .. క్వార్ట‌ర్స్‌లోనే ఇంటి దారి ప‌ట్టింది. బ్రెజిల్ కీల‌క ఆట‌గాడు నేయ్‌మోర్‌ జూనియ‌ర్‌.. మ్యాచ్ ముగిశాక వెక్కి వెక్కి ఏడ్చాడు. అత‌న్ని ఓదార్చేందుకు జ‌ట్టు ఆట‌గాళ్లు ప్ర‌య‌త్నించారు. అయినా నేమార్ మాత్రం ఏడుపును ఆపుకోలేక‌పోయాడు.

డిసెంబర్‌ 14న లూసైల్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా క్రోయేషియా జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి…

భారత క్రికెట్‌ షెడ్యూల్‌ ఇదే…

ఆంధ్రాలో వెలిసిన ఫ్లెక్సీలు….

ఆ 144 ఎంపీ స్థానాలపై బీజేపి గురి….

- Advertisement -