“సర్కారు వారి పాట”లో అరవింద్ స్వామి

406
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈమూవీ మహేశ్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో మహేశ్ సరసన రష్మిక మందన నటించింది. ఈమూవీ తర్వాత మరో కథను ఎంపిక చేసుకోవడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు మహేశ్ . ఇక మహేశ్ బాబు ప్రస్తుతం గీత గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈమూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటివలే ఈమూవీ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈమూవీ టైటిల్ చూస్తుంటే పక్కా మాస్ యాంగిల్ లో మహేశ్ కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ఈ మూవీలో విలన్ గా ముందుగా కన్నడ నటుడు ఉపేంద్రను తీసుకోవాలనుకున్నారు. కథ విని ఆయన కూడా బాగానే ఎగ్జైట్ అయ్యాడు. అయితే అంతలోనే లాక్‌డౌన్.. కరోనా వైరస్ గ్యాప్ రావడంతో ఆయన కుదర్లేదు. ఆయన వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఈమూవీని వదులుకున్నాడు. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈమూవీలో మహేశ్ కు విలన్ గా అరవింద్ స్వామిని తీసుకున్నట్లు తెలుస్తుంది. కథ నచ్చడంతో అరవింద్ స్వామి కూడా వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా అరవింద్ స్వామి గతంలో రామ్ చరణ్ ధృవ మూవీలో విలన్ గానటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి విలన్ గా తెలుగు ప్రేక్షకులను కనిపించనున్నాడు అరవింద్ స్వామి. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు చిత్రయూనిట్.

- Advertisement -