ఓటు హక్కు వినియోగించుకున్న కేజ్రీవాల్..

454
kejriwal
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సీఎం కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.నిర్మణ్ భవన్ సెంటర్ లో ఓటు వేశారు కేజ్రీవాల్. ఇక ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలకమైన షాహీన్ బాగ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,689 ప్రాంతాల్లో 13,750 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్‌ ప్రక్రియను మొత్తం వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రధానంగా పోటీ ఆప్- బీజేపీ మధ్య నెలకొంది. ఈ నెల 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. సంక్షేమానికి-భావోద్వేగానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -