బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి గీత..

311
Araku Former MP Kothapalli Geetha
- Advertisement -

ఏపీలోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఈ రోజు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఆమెకు పార్టీ కండువా కప్పి కమలం గూటికి ఆహ్వానించారు. గతేడాది స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనకు ఏ పదవి, బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు.

Araku Former MP Kothapalli Geetha

- Advertisement -