నిలకడగా తేజు ఆరోగ్యం..

110
dharam
- Advertisement -

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ శుక్ర‌వారం రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించగా తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. తర్వాత ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు.

తేజు ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. య‌న ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని…రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని డాక్టర్లు వెల్లడించారు.

ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నామని….48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు. తేజ్ త్వ‌ర‌గానే కోలుకుంటాడని, ఎవరూ టెన్షన్ పడొద్దని డాక్టర్లు స్పష్టం చేశారు.

- Advertisement -