ఉన్మాదం సృష్టిస్తోన్న బీజేపీ:షర్మిల

20
- Advertisement -

దేశంలో బీజేపీ ఉన్మాదం సృష్టిస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. విజయవాడలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సదస్సుకు హాజరైన షర్మిల…బీజేపీ తీరును ఎండగట్టారు. అంబానీ, అదానీలకు దేశాన్ని బీజేపీ దోచిపెట్టిందన్నారు.

మతాలను రెచ్చగొడుతోందని, కులాల మధ్య తగవులు పెడుతుందని విమర్శించారు. బీజేపీవి స్వార్థ రాజకీయాలని, వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు.మన పోరాటం రేపటి కోసమని …అన్ని మతాలు మనుషులంతా ఒక్కటే అని చెబుతున్నాయని కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మతం పేరుతో చిచ్చు పెడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీ చేస్తున్న రాజకీయ దాడులకు భయపడి ఎంతోమంది ఆ పార్టీలో చేరుతున్నారని.. బీజేపీ మెప్పు కోసం స్థానిక ప్రభుత్వాలు పని చేస్తున్నాయని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో గంగవరం పోర్ట్ ను తక్కువ ధరకు అదానికి కట్టబెట్టారని…విశాఖ స్టీల్ ను సైతం అదానీ, అంబానీ లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని అన్నారు.

Also Read:సుప్రీంకు క్షమాపణ చెప్పిన పతంజలి..

- Advertisement -