దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్ ఐడీ’ అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని వర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలను ఆదేశాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ వన్ నేషన్-వన్ స్టూడెంట్ పేరిట 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ.. అదే అపార్ గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. అందులోభాగంగానే… అపార్ ఐడీలను రూపొందించడంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అంబేద్కర్ యూనివర్సిటీ. ఇప్పటికే 75 శాతం అపార్ ఐడీలను క్రియేట్ చేసింది.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అపార్ ఐడీ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కేంద్ర విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాటి… అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అభినందించారు. 100 శాతం అపార్ ఐడీలు అతి త్వరలోనే పూర్తిచేసి రికార్డ్ క్రియేట్ చేయాలన్నారు.
Also Read:మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో రిలీఫ్..