ఏపీ ప్రజల మనోగతం ఇదే!

11
- Advertisement -

ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించింది. 160కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధించగా పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందింది జనసేన. పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ 70 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఏపీ ప్రజల మనోగతాన్ని పరిశీలిస్తే శ్రీకాకుళం చితకొట్టగా, విరగొట్టిన విజయనగరం, విసిరేసిన విశాఖ, తరిమేసిన తూర్పుగోదావరి, పాతరేసిన పశ్చిమగోదావరి, కూల్చేసిన కృష్ణ , కారం కొట్టిన గుంటూరు, ఓడ గొట్టిన ఒంగోలు, నేల కూల్చిన నెల్లూరు, చీ కొట్టిన చిత్తూరు, కాల్చేసిన కడప, ఖతం చేసిన కర్నూల్,
అంతం చేసిన అనంతపురం ఇలా అన్ని జిల్లాల్లో కూటమి అభ్యర్థులు సత్తాచాటారు.

అసెంబ్లీతోపాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. టీడీపీ కూటమి దూకుడుకు ఆరు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు.

Also Read:భారీగా తగ్గిన జగన్ మెజార్టీ!

- Advertisement -