వరద పరిస్థితిపై మంత్రి లోకేష్ రివ్యూ

3
- Advertisement -

మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి సహాయక చర్యలు. ఈ రోజు సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేశారు.

బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్ లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశారు. విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ చేరుకున్నాయి పార్టీ శ్రేణులు. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు 14,452 మంది నిరాశ్రయులు. ప్రకాశం బ్యారేజి వద్ద వేగంగా తగ్గుతుంది వరద. ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులుగా ఉంది.

Also Read:భారీ వర్షాలు..ఉద్యోగులు రూ.100 కోట్ల విరాళం

- Advertisement -